Kakinada Student Nehanjani Scores 600 Marks in AP SSC Results : ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు వచ్చాయి. నగరంలోని భాష్యం పాఠశాలలో బాలిక చదువుతోంది. మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.