Sameera Of Palnadu District Got 596 marks In SSC Exams : మట్టిలో మాణిక్యం అనే నానుడిని తన ప్రతిభతో నిజం చేసింది పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన నిరుపేద విద్యార్థిని షేక్ సమీరా. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 600 మార్కులకుగానూ 596 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో రాష్ట్రంలోనే రెండో స్థానం కైవసం చేసుకుంది. ఈ విద్యార్థిని సివిల్స్ సాధించడమే లక్ష్యమంటోంది. నిరుపేద అయిన సమీరా తన పైచదువులకు దాతలు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.