Navodaya Vidyalaya in Palnadu District: గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యుత్తమ విద్యను అందిస్తోంది పల్నాడు జిల్లాలోని నవోదయ విద్యాలయం. దాదాపు 40 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ విద్యా సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కోర్సులను, సాంకేతిక అంశాల్ని విద్యార్థులకు చేరువ చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన జేఈఈ, ఐఐటీ, నీట్, బిట్స్ పిలానీ లాంటి పరీక్షలకు ఉచితంగా శిక్షణనిస్తూ విజేతలుగా నిలుపుతోంది. ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తూ వారి లక్ష్యసాధనకు దోహదపడుతుంది. విజ్ఞాన జ్యోతి లాంటి కార్యక్రమాలతో బాలికల విద్యన్నోతికి బాసటగా నిలుస్తోంది.