Nirmal District Ethnol Factory Conflict : నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని శాంతియుత నిరసన చేశారు. గ్రామంలోని ప్రజలు కుటుంబ సమేతంగా వందల సంఖ్యలో వచ్చి రహదారి నిరసనలో పాల్గొన్నారు. ఇందులో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఉండటం గమనార్హం. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావు కనబడుట లేదంటు చిత్రపటాలను ప్రదర్శించారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేసేంతవరకు తమ పోరాటం ఆగేది లేదని దిలావర్పూర్ మండలం ప్రజలు స్పష్టం చేశారు.