Floods in Telugu States : ఒక సారి నష్టం జరిగితే రెండో సారి అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి పదేపదే నష్టం జరుగుతున్నా సరిదిద్దుకోకుంటే దాన్నే నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం విలయాలు. వీటికి ప్రకృతి ప్రకోపం కారణమైనా మనిషి చేసిన తప్పిదాలు, పాఠాలు నేర్వని తత్వమే నష్టం తీవ్రతను మరింత పెంచింది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి. ఈ విపత్తులు మనిషి ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. మరి ఎలా అప్రమత్తం కావాలి. ఏ జాగ్రత్తలు తీసుకుంటే వరదలను తప్పించుకోగలం. ఈ విపత్తుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి.