HAJ Bhavan In Vijayawada:ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్, ఉమ్రా యాత్ర చేయాలని మక్కాను సందర్శించాలని భావిస్తారు. అయితే వారి యాత్ర సులభతరం కావడం కోసం రాష్ట్రం నుంచి నేరుగా మక్కాకు వెళ్లేందుకు 2018లో గత టీడీపీ హయాంలో విజయవాడలో హజ్ భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేసారు. కానీ 2019 ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ దీన్ని పూర్తిగా విస్మరించింది. దాంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం సోదరుల్లో మళ్లీ దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి.