PSR Anjaneyulu Irregularities in Group-1 Answer Sheets Evaluation : 2018 నాటి గ్రూపు-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ విధానంలో మూల్యాంకనం జరిగిన జవాబుపత్రాల ఫలితాలనే స్వల్పమార్పులతో మాన్యువల్ మూల్యాంకనంలోనూ చూపించేందుకు నాటి APPSC కార్యదర్శి PSR ఆంజనేయులు పక్కా నాటకానికి తెరతీశారు. సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో వాటినే ప్రభుత్వ డబ్బుతో యథావిధిగా చేసి, OMR షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదు చేయించారు. సుమారు 90 వేల OMR షీట్లపై ఇలా చేయించారు. నాటి సీఎం జగన్ అండదండలు చూసుకుని, APPSC ప్రతిష్ఠను, అభ్యర్థుల భవిష్యత్తును చిదిమేసేందుకు పీఎస్ఆర్ కుయుక్తులు పన్నారు.