CM Revanth Reddy on Group 1 Exam Ratio : నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో పిలవాలని కొందరు అంటున్నారని తెలిపారు. ఈ నిష్పత్తిలో పిలిస్తే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టత ఇచ్చారు. కానీ నోటిఫికేషన్లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టు మళ్లీ స్టే విధిస్తుందని చెప్పారు. కొంతమంది చెప్పినట్లు 1:100 పిలిస్తే మళ్లీ గ్రూప్-1 మొదటికి వస్తుందని వివరించారు. జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, గ్రూపు-1, డీఎస్సీ పోటీ పరీక్షల అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.