CM Revanth Reddy Public Meeting : మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
త్వరలోనే మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్కుమార్రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.