CM Revanth On BRS Party's Future : ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాను కలిసి సహకరించాలని కోరినట్లు తెలిపారు. గ్రూప్-1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరి ఎత్తులు వేస్తున్నారని వారి ఆటలు సాగనివ్వనని రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. 36 నెలల్లో మూసీ నదిని అభివృద్ధి చేసి చూపిస్తామని అదే తమ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్కు చరిత్ర ఉందిగానీ, భవిష్యత్తు ఉండబోదని సీఎం వ్యాఖ్యానించారు.