PSR Anjaneyulu GROUP-1 Frauds : గ్రూప్-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో నిధుల దుర్వినియోగంపై ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయులు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పీఎస్ఆర్ను ఏ1గా చేర్చారు.