APPSC Group-1 Scam : గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణంలో డొంక కదులుతోంది. సమాధాన పత్రాలు దిద్దేందుకు కనీస అర్హతలు లేని వ్యక్తుల్ని నియమించుకుని క్యామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ దందాకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తం రాకెట్ వెనక ఉన్న వ్యక్తుల్ని బయటకు లాగాల్సి ఉందన్నారు. మధుసూధన్ రిమాండ్ రిపోర్ట్లో ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడించారు.