EVIDENCE DESTROYED IN LIQUOR SCAM : నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డ వైఎస్సార్సీపీ మద్యం మాఫియా ముఠా దానికి సంబంధించిన ఆధారాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది. ఒకటో, రెండో కాదు ఏకంగా 350 టెరాబైట్ల డేటాను నాశనం చేశారు. ఫోరెన్సిక్ రికవరీకీ వీల్లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది. అవన్నీ దొరికి ఉంటే మద్యం కుంభకోణంలో మరికొన్ని కోణాలు బయటపడేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.