నేటితరం ప్రేమ పేరుతో మనసు పారేసుకుని పుస్తకాలను దూరం పెట్టేస్తున్నారు. భవిష్యత్ లక్ష్యాలను పక్కన పెట్టి బంగారు లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రేమ శృతి మించడంతో హత్యలు, ఆత్మహత్యలూ జరుగుతున్నాయి. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డా రు. వివాహం చేసుకుందామని నిశ్చయింకున్నారు. కానీ, సర్కారీ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని మాత్రం మరువలేదు. కృత నిశ్చయంతో ఒకరు 4, మరొకరు 2 ప్రభుత్వ కొలువులు సాధించిపెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు మెదక్ జిల్లాకు చెందిన నవీన్, పద్మ.