Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Yogandra In Visakha Minister Satyakumar: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా మార్చాలన్న లక్ష్యంతో యోగాను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. "నభూతో నభవిష్యత్' అనేలా యోగాంధ్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. అనేక రికార్డులు సృష్టించేలా విశాఖ వేదికగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. యోగాంధ్రలో పాల్గొనే ఔత్సాహికులకు ఇప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా విశాఖ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేక రికార్డులు సృష్టించనుందని సత్యకుమార్‌ యాదవ్‌ వివరించారు. రేపు ఉదయం 6 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. నెలరోజులుగా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాలల్లో కూడా యోగా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు  తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతోపాటు యోగా వేడుకల ఏర్పాట్లు మినిట్‌ టు మినిట్ ఏం చేయబోతున్నారనే అంశాలను ఈటీవీ భారత్​తో సత్యకుమార్ యాదవ్ పంచుకున్నారు. 

Category

🗞
News

Recommended