CM Chandrababu in Annamayya District: రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను నెలనెలా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్న సీఎం చంద్రబాబు, నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. సంబేపల్లి మండలం మోటుకట్లలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. అదే విధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ ఉద్యోగులకు జిల్లాలవారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.