CM Chandrababu Tour in Flooded Area in Vijayawada: ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు నాలుగు గంటల పాటు నిర్విరామంగా పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా దాదాపు 22 కి.మీ మేర జేసీబీపైనే సీఎం ప్రయాణం సాగింది.