CM Chandrababu on Power Sector: ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మర్పులు వచ్చాయని సీఎం తెలిపారు. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని గుర్తుచేశారు. రైతుల ఇబ్బందులు చూసాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.