CM Chandrababu About AP Income : గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అమరావతిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవనాడి అని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ పాలనలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని ఆక్షేపించారు. స్థానికులు రాష్ట్రంలో పెట్టుబడులకు వెనకాడే పరిస్థితి నెలకొందని వాపోయారు. తెలంగాణకు హైదరాబాద్ ద్వారా అత్యధిక తలసరి ఆదాయం వస్తోందని వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధిరేటుపై చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.