YSRCP Leaders Harassed To Mumbai Actress : ముంబయికి చెందిన సినీనటిని జగన్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్లు కలిసి వేధించిన వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ సంస్థ ఛైర్మన్ సజ్జన్ జిందాల్పై ముంబయిలో ఆమె అత్యాచారం కేసు పెట్టింది. దీనిని గుట్టుగా సెటిల్ చేసేందుకే సినీనటి కుటుంబ సభ్యులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జైలులో బెదిరించి చెప్పిన వాటికల్లా అంగీకరించిన తర్వాత పోలీసులే వారిని బెయిల్పై బయటకు తీసుకొచ్చి ముంబయి వెళ్లేందుకు అనుమతిచ్చారని ఆరోపణలున్నాయి.