Kapildev Met CM Chandrababu Naidu: ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీతో కలిసి కపిల్ దేవ్ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చించారు. క్రీడలపై కూడా సీఎం చంద్రబాబుకు చాలా ఉత్సుకత ఉందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పష్టం చేశారు.