Grama Sabha in Telangana : నాలుగు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభల్లో రెండో రోజు అక్కడక్కడ ఆందోళనలు మినహాయించి ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు 60శాతం పూర్తైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం వరకు 9,844 గ్రామాల్లో విజయవంతంగా సభలు నిర్వహించినట్లు తెలిపింది. గ్రామ, వార్డు సభల్లో కొత్తగా 10,09,131 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో రోజు 3,608 గ్రామ, 1,055 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీల్లో 12,914 గ్రామ సభలు, పట్టణాల్లో 3,484 వార్డు సభలు నిర్వహించాల్సి ఉంది.