YSRCP Leaders Irregularities in Kakinada Sez lands : కాకినాడ సెజ్ భూములను వైఎస్సార్సీపీ రాబందులు దిగమింగారు. వైఎస్సార్సీపీ హయాంలో మొదలైన జే-గ్యాంగ్ భూదందా రెండు దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగింది. జగన్మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకు అప్పజెప్పేశారు. కన్నబాబు కమిటీ పేరిట బురిడీ కొట్టించి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు. అడ్డగోలుగా సాగిన జే-గ్యాంగ్ ఆగడాలు, రైతుల ఆక్రోశంపై ఈటీవీ భారత్-ఈనాడు క్షేత్రస్థాయి పరిశోధన చేశాయి. బులుగు బ్యాచ్ దోపిడీ, దగాపడిన రైతుల సమగ్ర వివరాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతున్నాయి.