CM Chandrababu Met Tata Group Chairman Chandrasekaran : పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తూ రాష్ట్రంలో మరో తాజ్, వివాంతా, గేట్ వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకు వచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని టాటా కంపెనీల ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూపు ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగతుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ తొలి భేటీలో పాల్గొన్న సీఎం భవిష్యత్తులో 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు.