Nandigam Suresh Police Custody on Mariyamma Murder Case : బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయంటారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో చక్రం తిప్పిన నాటి ఎంపీ నందిగం సురేశ్ తుళ్లూరు పోలీసుస్టేషన్ అడ్డాగా చెలరేగిపోయారు. తప్పుడు కేసులతో టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టారు. ఇప్పుడు అదే పోలీసుస్టేషన్లో ఓ హత్య కేసులో విచారణకు హాజరయ్యారు.