Woman Murder Case In Medchal : ఓ మొబైల్ ఛార్జర్ కోసం మొదలైన గొడవ చివరకు మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 23న ఈ ఘటన చోటుచేసుకోగా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.