Cumbum Mother Killed Son Case : ప్రకాశం జిల్లా కంభంలో కన్నతల్లే కుమారుడిని ముక్కలు ముక్కలుగా నరికించి హత్య చేయించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కంభం పట్టణంలో కడం లక్ష్మీదేవి (సాలమ్మ) నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరికి వివాహాలయ్యాయి.