Son Murdered His Mother Due To Online Games in Visakhapatnam : విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు ల్యాప్టాప్ ఇవ్వనందుకు సొంత తల్లిలే కుమారుడు కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆన్లైన్ గేమ్స్ వద్దని వారించిన కన్నతల్లిని కుమారుడే కడతేర్చాడని వెల్లడించారు. విశాఖ మల్కాపురంలోని కోస్టుగార్డు క్వార్టర్స్లో భర్త బల్బీర్సింగ్, ఇద్దరు పిల్లలతో కలిసి అల్కసింగ్ నివసిస్తోందన్నారు. రెండ్రోజుల కిందట బీటెక్ చదువుతున్న కుమారుడు అనుమొల్సింగ్ ఆన్లైన్గేమ్ ఆడుతుండగా చూసిన దంపతులు అతడి నుంచి ల్యాప్టాప్ తీసుకున్నట్లు చెప్పారు.