What Happening On Viveka Murder Case : రాష్ట్రంలోనే అత్యంత సంచలన సృష్టించిన మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు ఆరేళ్లయినా అతీగతీ తేలలేదు. దేశంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సీబీఐ సైతం ఇప్పటికీ అసలు కుట్రధారులు, సూత్రధారులను నిర్థరించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ నాంపల్లి సీబీఐ కోర్టులో కేసు విచారణ ప్రారంభమే కాలేదు. ఈ కేసులో నిందితులు ఇప్పటికే బెయిల్పై దర్జాగా బయట తిరుగుతుండగా కీలక సాక్షులు మాత్రం ఒక్కొక్కరుగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతున్నారు. తండ్రిని చంపిన కిరాతకులకు శిక్షపడేలా చేసేందుకు వివేకా కుమార్తె సునీత గల్లీ నుంచి దిల్లీ వరకు ఒంటరిగా పోరాటం చేస్తోంది.