Boduppal Murder Case In Hyderabad : ఆస్తి చేజారిపోతుందనే అక్కసుతో ఓ సవతితల్లి దారుణానికి ఒడికట్టింది. మరిది, అతని స్నేహితునితో కలిసి కుమార్తెను హత్య చేసింది. పెళ్లి ఇష్టంలేక వేరే వారితో వెళ్లిపోయిందని కట్టుకథ అల్లింది. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందంటూ భర్తను ఏమార్చింది. నెలలు గడుస్తున్నా బిడ్డ జాడ తెలియక తల్లడిల్లిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.