Minister Komatireddy On GHMC Divide : హైదరాబాద్ మహానగర జనాభా కోటిన్నర దాటిందని జీహెచ్ఎంసీని నాలుగు మేయర్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసోచామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగర రూపు రేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.