Minister Gummadi Sandhya Rani Fires on YS Jagan : పెద్దవాళ్లంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ తీరు మారకుంటే ప్రజలు ఈసారి కూడా క్షమించరని ఆయన మానసిక పరిస్థితికి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు బూతులు మాట్లాడిన జగన్ నోట నీతులు ప్రజలు వినలేకపోతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కేంద్ర, రాష్ట్ర నిధులన్నీ దారిమళ్లించి వాడేసుకున్న తిమింగళాలని విమర్శించారు.