CM Revanth Reddy About Manmohan Singh : దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు భారతరత్న ఇ్వవాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతి పట్ల నివాళులర్పించిన తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపింది. సరళీకృత ఆర్థిక విధానాలతో మన్మోహన్సింగ్ భారత్ను బలమైన ఆర్థికశక్తిగా నిలబెట్టారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ఆత్మబంధువుగా మన్మోహన్సింగ్ స్థానం ప్రజల గుండెల్లో శాశ్వతమని తెలిపారు.