Union Minister Bhupathi Raju Srinivasa Varma Visited Jangareddygudem : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పర్యటించారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కార్యక్రమం అనంతరం స్థానిక బీజేపీ నేత మల్లాది సీతారామారావు ఇంటికి వెళ్లారు. దీంతో పలువురు బీజేపీ, కూటమి నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు.