Minister Uttam on Kaleshwaram : కమీషన్ల కక్కుర్తి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపేశారని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జలసౌధలో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు.