Minister Rajanarsimha On DA : ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉపాధ్యాయులందరికీ హెల్త్కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అందోల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అందోల్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. రూ.50 కోట్లతో ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.