Minister Damodara Raja Narasimha Serious On Treatment Of Dead Body : హైదరాబాద్లోని మదీనాగూడ సిద్ధార్థ ఆస్పత్రిలో తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో 2 రోజులు మృతదేహానికి చికిత్స చేసినట్లు మీడియాలో కథనాల వచ్చాయి. ఈ ఘటనపై మంత్రి స్పందించారు. దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు, వైద్యులు బృందం ఆస్పత్రిలో తనిఖీలు చేశారు.