Skip to playerSkip to main contentSkip to footer
  • 8/14/2019
Three Candiates From YCP filed nominations for MLC Elections in MLA Quota.These three candidates elect unanimously for legislative council.
#mlcelections
#ysrcp
#ysjagan
#andhrapradesh

ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లకు చివరి రోజు కావటంతో..ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ సీట్ల భర్తీ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నుండి ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో.. ఈ ఎన్నికల్లో పోటీ లేకుండా పోయింది. వైసీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు మంత్రి మోపిదేవి వెంకట రమణ..ఇక్బాల్.. చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేసారు. వారికి మద్దతుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండటంతో..ఆ రోజును వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.

Category

🗞
News

Recommended