KTR Reaction On Notices To KCR : చట్టాలు, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలికొదిలి ఇలాంటి పనులు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలన కాస్తా కమీషన్ల పాలనగా మారిందని విమర్శించారు.
Category
🗞
News