KTR Reacts On Patnam Narender Reddy Arrest : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కనీసం కుటుంబానికి సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఎలా తీసుకెళ్తారని అధికారులను ఆయన నిలదీశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కిడ్నాపర్లలా వచ్చి తీసుకెళ్లే దానిని అరెస్ట్ అంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల వల్ల ప్రజలు ఆగమవుతున్నారని, రైతుల ఆక్రందనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.