Chilkur Balaji CS Rangarajan Attack : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్ రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.