Man Arrested Due to sell fake Gold Biscuit in proddatur : తక్కువ ధరకే బంగారం ఇస్తామని మాయమాటలతో నమ్మించి, నకిలీ బంగారం బిస్కెట్ విక్రయించి డబ్బుతో ఉడాయించిన కేసులో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా పోలీసులు నిందితుడు పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన బండారు నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఒకటో ఠాణాలో డీఎస్పీ భావన గురువారం సాయంత్రం వెల్లడించారు.