Srinivasa Kalyanam in Amaravati : తిరుమల వేంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవానికి రాజధాని అమరావతి సిద్ధమైంది. వైకుంఠనాథుని కరుణా కటాక్షాలు అమరావతికి ఉండాలని రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తోంది. వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద నేడు జరిగే కళ్యాణానికి సీఎం చంద్రబాబు, గవర్నర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.