CM Chandrababu on Capital Amaravati Works : అమరావతి పున:ప్రారంభం రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గ రోజుగా మిలిగిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 5 కోట్ల ఆంధ్రులు సగర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మాణం ఉంటుందన్న సీఎం మూడేళ్లలోనే పూర్తి చేసి మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అమరావతి సర్వేశ్రేష్ఠ రాజధాని అవుతుందని దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతి అన్స్టాపబుల్ అని దీనిని ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.