Minister Narayana on Capital Amaravati: రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్లని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో మంత్రి నారాయణ స్పష్టంచేశారు. క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం చెప్పారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ వివరించారు.