CM Revanth Serious about Handcuffs To Farmer : లగచర్ల రైతు హీర్యానాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహిందని స్పష్టం చేశారు. హీర్యానాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.