Tension At Manchu Mohanbabu House: మంచు కుటుంబంలో వివాదం తీవ్రస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లిలో మోహన్బాబు ఇంటికి కుమారుడు మంచు మనోజ్ రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి అదనపు డీజీపీని కలిసిన అనంతరం మంచు మనోజ్ దంపతులు మోహన్బాబు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో మంచు మనోజ్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గేటు తెరవాలంటూ సెక్యూరిటీ సిబ్బందిపై మనోజ్ మండిపడ్డారు. తమ పాప లోపల ఉందని, గేటు తీయాలని ఆగ్రహించారు. గేటు తీయకపోవడంతో నెట్టుకొని లోపలికి వెళ్లారు.