రోడ్డుపై బైఠాయించిన నాంపల్లి ఎమ్మెల్యే : మరోవైపు నాంపల్లిలోనూ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రహదారికి ఇరువైపుల అక్రమంగా ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. విషయం తెలుసుకున్న నాంపల్లి మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వెంటనే అక్కడికి వచ్చి తొలిగింపు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు.