Chandrababu Inspected Vijayawada Flood Areas : హెలికాప్టర్లో వెళ్తే వాస్తవాలు తెలియవనే తాను దాదాపు 25 కిలోమీటర్లు జేసీబీపై పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద వల్ల పాడైన వాహనాలకు బీమా ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సైతం సాయం అందిస్తామని చెప్పారు. విజయవాడలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు.