Dasara celebrations in Vijayawada 2024 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఆదివారం సెలవురోజు కావడంతో జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ప్రారంభమైన రద్దీ ఏ సమయంలోనూ తగ్గుముఖం పట్టలేదు.